మల్కాజిగిరి, మే 29 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల సందర్భంగా ఇతర శాఖలతో సమన్వయంతో పనులు పూర్తిచేయాలని తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధి పనులపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
విద్యుత్శాఖల మధ్య సమన్యంతో పనులు పూర్తిచేయాలన్నారు. విద్యుత్ వైర్లను అండర్గ్రౌండ్లోకి మార్చే పనుల పురోగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజినీర్ రాజేంద్రప్రసాద్, రవిప్రకాశ్, రైల్వే యూనియన్ సభ్యులు నూర్, విద్యుత్ అధికారులు వెంకన్న, డీఈ అన్వర్, నేతలు ఏకే.మురుగేష్, సిద్ధిరాములు, నర్సింగ్రావు, నరహరి, తదితరులు పాల్గొన్నారు.