బాలానగర్ : ఫతేనగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో రూ. 2.39 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని భరత్నగర్, ప్రభాకర్రెడ్డినగర్, సమతానగర్, గౌతంనగర్, ఎల్బీఎస్నగర్, ఆర్ఆర్ బేకరీ, హరిజనబస్తీ, జవహార్నగర్, పిట్టలబస్తీ యూజీడీ రీ మోడలింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్మికనగర్, అమృత్నగర్, సమతానగర్లలో చైన్ లింక్ మెష్ ఏర్పాటు పనులకు గాను రూ.29 లక్షలతో స్థానిక కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.