MLA Bandari lakshma Reddy | కాప్రా, జూన్ 12 : గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కోరారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఎయిర్పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మినహా మిగిలినవారంతా చనిపోయారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్