అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉన్న దిశ చట్టాన్ని( Disha Act ) ఉపసంహరించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan ) తప్పుబట్టారు. కేబినెట్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు ( Block Day ) గా మిగిలిపోతుందని ట్విటర్లో పేర్కొన్నారు.
మహిళల భద్రతకు అండగా నిలిచిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైయస్సార్సీపీ ‘దిశ’ను తీసుకొచ్చిందని తెలిపారు.
నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించామని వెల్లడించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగామని వివరించారు.
164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశామని, తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారని పేర్కొన్నారు. దిశ రద్దు నిర్ణయాన్ని మంత్రివర్గం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, దిశను రక్షించాలి, మరింత బలోపేతం చేయాలని కోరారు.