మేడ్చల్ : వార్డులను దశల వారిగా అభివృద్ది చేసి మేడ్చల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 10వ వార్డులో రూ 15 లక్షల నిధులతో, 11 వ వార్డులో రూ. 5.5 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆ వార్డుల కౌన్సిలర్లు శివకుమార్ యాదవ్, సుహసినీలతో కలిసి చైర్మన్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వార్డులల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కనీస అవసరాలైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్ల సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, నాయకులు నర్సింహరెడ్డి, రవీందర్, నర్సింగ్రావు, వెంకటేశ్, నాగార్జునరెడ్డి, గోపాల్యాదవ్, బాలయ్య, కిరణ్, సందీప్రెడ్డి, రఘు, చాంద్ పాష తదితరులు పాల్గొన్నారు.