జీడిమెట్ల, జులై 8 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివ్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్కు చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జై భీమ్ నగర్ వాసులకు మంత్రి కేటీఆర్ సహకారంతో ఇండ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్, ప్రసాద్, బీజేపీ నుంచి రాకేష్, రాములు, టీడీపీ నుంచి రాజు, వెంకట్, అమృత, రోహిణి, భారతీ, రాజు, సీ.హెచ్.రాజు, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.