MLA KP Vivekanand | కుత్బుల్లాపూర్, మే 25 : మత్స్య సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి నిరంతరం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. ఇవాళ 132 జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డలోని ఎఫ్సీఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, జీడిమెట్ల శాఖ 5వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు జీవం పోస్తూ మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికాభివృద్ధిని అందించి, మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఫిషరీస్ కో- ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ సుకీర్తి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జీడిమెట్ల శాఖ అధ్యక్షుడు చిలుకూరి కృష్ణ, ఉపాధ్యక్షురాలు చిలుకూరి యాదమ్మ, ప్రధాన కార్యదర్శి మద్దూరి వీరేష్, డైరెక్టర్లు తాళ్ల వెంకటేష్, మన్నెశంకర్, అరికల లక్ష్మణ్, మద్దూరి సత్తెమ్మ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.