బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు సోమవారం రాత్రి కబ్జాకు యత్నించారని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ రాసాల వెంకటేశ్యాదవ్ అన్నారు.
అక్రమ నిర్మాణాలకు కాంగ్రెస్ నాయకులు మద్దతునిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పబ్లిక్ టాయిలెట్స్ కోసం కేటాయించినట్లు పూర్తి దస్తావేజులు ఉన్నాయని, ఇదే విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల తాసీల్ధార్ ఎస్తేరి అనిత ఆదేశాల మేరకు ఆర్ఐ ఫణీంధ్ర అక్రమ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించి అధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.