కుత్బుల్లాపూర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న భార్యభర్తలను వేర్వేరు రోజుల్లో రిమాండ్కు తరలించిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుండ్లపోచంపల్లిలో ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనేవిశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 27న పోలీసులు దాడులు చేపట్టారు.
ఈ దాడిలో ఒడిషా రాష్ర్టానికి చెందిన శరత్ సాహో(40), సుకుమారి సాహో(36)లు గత కొన్నేళ్ల కిందట నగరానికి వలస వచ్చి చెమడోడ్చకుండా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంట్లోనే గంజాయిని అమ్ముకుంటూ తన ఇద్దరు కొడుకులతో ఉంటున్నారు.
పోలీసులు దాడులు చేసే క్రమంలో ఇంట్లో ఉన్న మూడు కిలోల గంజాయి పట్టుబడగా శరత్ పరారీ కాగా అతని భార్య సుకుమారిని రిమాండ్కు తరలించి ఇద్దరు పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ వారికి అప్పగించారు. కాగా పరారీలో ఉన్న శరత్ మంగళవారం పట్టుబడడంతో రిమాండ్కు తరలించిన్నట్లు పోలీసులు తెలిపారు.