మేడ్చల్ రూరల్, ఆగస్టు : ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి పాటుపడాలని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బాసర్గడీలోని సేయింట్ క్లారెట్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనాతో విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడిందన్నారు.
ఆన్లైన్లో విద్యార్థుల చదువుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ రాజకుమారి సుధాకర్, ఆంథోనమ్మఫిలిప్స్, కో ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సుధాకర్, ఫిలిప్స్, భాస్కర్ రెడ్డి, ఇన్నారెడ్డి, మాథ్యుస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.