గాజులరామారం, ఆగస్టు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్దీకరణ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివారం గాజులరామారం పరిధిలోని పరికి చెరువు వద్ద రూ.49.87 కోట్లతో 28 ఎంఎల్డి సామర్థ్యంతో ఎస్టిపి నిర్మించేందుకు స్థలం కేటాయింపుపై ఎమ్మెల్యే ఎస్టిపి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరికి చెరువు పరిసర ప్రాంతాల నుంచి మురుగునీరు చెరువులో చేరడంతో చెరువు పూర్తిగా కలుషితంగా మారిందన్నారు. ఎస్టిపి నిర్మాణంతో మురుగునీరు శుద్ది చేసి తిరిగి చెరువులోకి చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపి జీఎం తిప్పన్న, డీజీఎం మురళీ మనోహర్, సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నాయకులు సురేష్రెడ్డి, డీఈ రామ్చందర్రాజు, ఎస్టిపి మేనేజర్ శ్రీకాంత్, నాయకులు పరుష శ్రీనివాస్యాదవ్, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.