దుండిగల్,జూలై7 : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ నెహ్రునగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు అన్నం సుభాష్, శ్రీనివాస్, శివకుమార్, మోహన్, ఏసు, సత్యనారాయణ, చిన్ని, రాజ్కుమార్ గురువారం పేట్బషీరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్సారధ్యంతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గౌరవం దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, దుండిగల్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీనియర్ నాయకుడు సయ్యద్ రషీద్, కృష్ణగౌడ్ ,మారయ్య, కుంట సిద్దిరాములు, సుదర్శన్రెడ్డి, వేణుయాదవ్, సూరారం డివిజన్ కార్యదర్శి సిద్దిక్, మధుమోహన్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.