ఘట్కేసర్,ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో వైశువైద్య శాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేకలు, గొర్రెల నట్టల నివారణ మందు పంపిణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మేకలు, గొర్రెల ఆరోగ్య పరిస్థితి పై ప్రభుత్వం ఎప్పటి కప్పుడు అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
పెంపకం దారులకు గొర్లను, మేకల పంపిణి, రైతులకు పాడి గేదల కొనుగోలుకు బ్యాంకు రుణాలను ప్రభుత్వం అందజేసి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. నట్టల మందు పంపిణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపట్టి మేకలు, గొర్రెల సంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమని అన్నారు.
దొడ్ల వద్దకే వైద్యులు వెళ్ళి చికిత్స అందించడం పెంపకం దారులకు లాభదాయకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య శాఖ ఏడి డాక్టర్ ఎం. ఆదిత్య కేశవ సాయి, ఘట్కేసర్ పశువైద్య అధికారి డాక్టర్ పద్మిని, వైస్చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్ వెంకట్రెడ్డి, నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, గోపాల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.