శామీర్పేట : కులవృత్తుల అభ్యోన్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిటుకుల సత్యంనాయీ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ అన్నారు. ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు అందజేస్తున్న ఉచిత విద్యుత్ కు ఎలా అప్లై చేసుకోవాలనేదానిపై శుక్రవారం శామీర్పేటలోని సంఘం కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని నాయీ సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అందుకు దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, మీటర్ కనెక్షన్స్, పాస్ఫోటో, మీ సేవా ద్వారా పొందిన కుల దృవపత్రం, షాప్ ముందు ఫోటో తప్పనిసరి జతపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యంనాయీ, మండల అధ్యక్షుడు ఉద్దెమర్రి కృష్ణానాయీ, శశికాంత్, బిక్షపతి, దిలీప్రాజ్, ఓందాస్, తదితరులు పాల్గొన్నారు.