చర్లపల్లి, ఆగస్టు : కుటీర పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా చేనేత వస్తువులను తయారు చేసే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ వైద్యశాల చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ నాయకుడు కాసం మహిపాల్రెడ్డిలు పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శనివారం టీఆర్ఎస్ నాయకుడు కాసం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, చేనేత కార్మికులను అన్ని విధాలుగా అదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేనేత కార్మికులు ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని వారు సూచించారు.
చేనేత రంగాన్ని మరింత ప్రొత్సహించడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని వారు కొరారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బేతాల బాల్రాజు, నాయకులు కొండూరి మురిళిపంతులు, శిరీషారెడ్డి, కందుల లక్ష్మినారాయణ, మల్కా రమాదేవి, మహ్మద్బాజీబాషా, యార్లగడ్డ దుర్గ, యాకయ్య, గిరి, సురేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.