జవహర్నగర్ : జిల్లా స్థాయి అండర్-23 సెలక్షన్స్ను స్థానిక క్రీడా పాఠశాలలో శనివారం ఉదయం 8గంటలకు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్టాన్లీజోన్స్, రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెకిట్స్లో పాల్గొనేవారు తమ జనన దృవీకరణ పత్రాలను తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అథ్లెటిక్స్ ట్రాక్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
వయస్సు 16నుంచి 23సం. లోపు బాల, బాలికలు పోటీలలో పాల్గొనవచ్చని, పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసి ఈ నెల 21, 22 తేదీలలో హైదరాబాద్లో జీయంసీ బాలయోగి స్టేడియంలో జరిగే మొదటి రాష్ట్రస్థాయి అండర్-23 అథ్లెటిక్స్ మేడ్చల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. వివరాలకు అసోసియేషన్ ప్రతినిధి రాజశేఖర్ 9849612733ను సంప్రదించగలరు.