నేరేడ్మెట్, ఆగస్టు :ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్.గాండ్ల గణేష్బాబు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, డ్రెస్లు పంపిణీ చేశారు. శనివారం నేరేడ్మెట్ శ్రీకాలనీలోని తన నివాసం వద్ద తన కుమారుడికి కూతురు పుట్టిన సందర్భంగా దుస్తులు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు.
పారిశుధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం ఏదొవిధంగా పలు కార్యక్రమాలను చేపట్టి కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా నిలుస్తూ తనకు చేతనైన సాయం చేస్తూ స్పూర్తినిస్తున్నారు. పేదల కోసం అన్నదానంతోపాటు తనవంతుగా ఆర్ధిక సాయం అందిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు. వీరితో పాటు తన భార్య కల్పన, కుమారుడు శశాంక్ తదితరులు పాల్గొన్నారు.