కేపీహెచ్బీ కాలనీ, జూలై 6 : భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని సర్దార్పటేల్నగర్, భగత్సింగ్నగర్ ఫేజ్-1, కేపీహెచ్బీ కాలనీ 3, 6, 7వ ఫేజ్లలో రూ.1.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సహకారంతో నగరంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలన్నీ తీరుతున్నాయన్నారు. చెరువులు, పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజవకర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న స్థలాలను పార్కులుగా, ఇండోర్ స్టేడియాలుగా అభివృద్ధి చేశామన్నారు.
దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం, రోడ్లన్నింటినీ వీడీసీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాస్రావుల, డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, కార్యదర్శి రాజేశ్, శ్యామలరాజు, విష్ణువర్దన్ రెడ్డి, సాయిశ్రీనివాస్, పాతూరి గోపి, బత్తుల హరిబాబు, ప్రతాప్, పెద్దిరాజు, వెంకట్రెడ్డి, రవిచంద్రకళ, భవానీ పాల్గొన్నారు.