జీడిమెట్ల, సెప్టెంబర్ 2 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు బస్తీ ప్రజలకు భద్రత ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధి చంద్రానగర్లో రూ.7 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు బస్తీలు, కాలనీల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.
కార్యక్రమంలో రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్గౌడ్, బాలానగర్ ఎసీపీ గంగారం, డీఐ శివరామకృష్ణ, ఎస్ఐ సతీష్ రెడ్డి, స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సి.శ్రీనివాస్రెడ్డి, ఎం.రామకృష్ణ, వార్డు మెంబర్ మెహరున్నీసా, తదితరులు పాల్గొన్నారు.