బాలానగర్ : మహిళలకు స్వచ్ఛంధ సంస్థలు కుట్టుమిషన్ శిక్షణ నేర్పించడం అభినందనీయమని ఫతేనగర్ కార్పొరేటర్ సతీశ్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధి ప్రభాకర్రెడ్డినగర్లో ప్రేమ్మార్గ్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ చేతుల మీదుగా కుట్టు శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడం సంతోషకరమని అన్నారు.
కుట్టు మిషన్ శిక్షణలో మెలకువలు పొంది ఉపాధిఅవకాశాలను మరింతగా మెరుగు పరుచుకోవాలని సూచించారు. భవిష్యత్లో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనేజేషన్ కో-ఆర్డినేటర్ మహ్మద్ సూఫీ ఉస్సేన్, ప్రభాకర్, సుజాత, అంగన్వాడీ టీచర్ హేమలత, టైలరింగ్ టీచర్ గిరిజ, బస్తీ అధ్యక్షుడు సాగర్, సెక్రటరీ బలరాం, సుదర్శన్రెడ్డి, రామ్రెడ్డి, చాంద్, సుధాకర్రెడ్డి విష్ణు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.