చర్లపల్లి, ఆగస్టు 23 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రీయను మరంత వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని న్యూ విరాట్నగర్లో డిప్యూటీ కమిషనర్ శంకర్తో కలిసి ఆమె పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రీయపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొవాలని ఆమె కోరారు.
కరోనా వైరస్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించి కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. డివిజన్లో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.