మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్కు రూ.21వేలు, రహమత్బేగంకు రూ.20వేల సీఎం సహాయ నిధి చెక్లను ఆమె మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానాల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి సంజీవినిగా మారిందన్నారు.
ఎంతో మంది సీఎం సహాయం భరోసాతో వైద్యం చేయించుకొని, ప్రాణాలను కాపాడుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసే సీఎం కేసీఆర్ ప్రజావసరాలను గుర్తించి, ఎంత కష్టమైనా నిధులు మంజూరు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమరం జైపాల్రెడ్డి, దొడ్ల మల్లికార్జున్, బేరి బాలరాజు, అమరం హేమంత్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, నాయకుల సురేందర్ గౌడ్, జనార్దన్రెడ్డి, మల్లారెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.