మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ది పర్చడమే తమవంతు కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్లోని 16వ వార్డులోని రాఘవేంద్రనగర్ కాలనీలో రూ 23 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను కౌన్సిలర్ ఉమా నాగరాజుతో కలిపి మున్సిపల్ చైర్మన్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు లేని మున్సిపాలిటిగా మార్చడానికి పాలకవర్గ సభ్యుల సహకారంతో పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహరెడ్డి, నాగరాజు, కమ్రూద్దీన్, లాయక్ అలీ, శ్రీనివాస్గుప్త, మహేందర్, సుధాకర్రెడ్డి, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.