ఘట్కేసర్: మున్సిపాలిటీలోని ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పోచారం మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు బాబానగర్లో మున్సిపాలిటీ సాధారణ నిధులు 11లక్షల 50వేల రూపాయలతో నిర్మించే సీసీరోడ్డు పనులను సోమవారం కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తుందన్నారు.
ఇందుకోసం అభివృద్దిలో మున్సిపాలిటీలకు ఎప్పటికప్పుడు ఆదేశాలను ఇస్తూ, పనులు నిర్వహిస్తుందనిఆయన తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రజల మౌళిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజి కాలువల పటిష్టం, పరిశుభ్రత, హరితరం వైకుంఠధామాలలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు వేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రెడ్డ్యా నాయక్,కమిషనర్ సురేష్,స్థానిక వార్డు కౌన్సిలర్ సరిత,ఇతర వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.