సూర్యపేట : ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్ ’ అని వ్యాఖ్యానించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ ( Apologize) చెప్పాలని బీఆర్ఎస్వీ ( BRSV ) నాయకులు డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ నిరసన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు బంటు సందీప్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కృషి చేస్తున్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కరాలు చూపాల్సిన ప్రభుత్వం, వారిని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదనీ అన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్యాంపస్ ప్లేస్మెంట్లు , ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చామకూరి మహేందర్, మీసాల వెంకట్, పల్లెటి సృజాన్, పడిదల క్యాండీ, పడిదల విన్ను, బంటి, శ్రీరామ్, అంజి, ఎలాగబోయిన వంశీ, తదితరులు పాల్గొన్నారు.