ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 15 వార్డులో సిసి రోడ్డు పనులను చైర్మన్ బి.కొండల్రెడ్డి గురువారం ప్రారంభించారు. 11 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అన్ని ప్రాంతాలలో సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో నిర్వహించే అభివృద్ది పనులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తూ, నిధులను అందిస్తుందని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో మురుగునీటి కాలువలు, రోడ్లు, పరిశుభ్రత, పచ్చదనం, వైకుంఠధామాల అభివృద్ది, తాగునీటి సరఫరా, పైప్లైన్ల ఏర్పాటు, విధీ దీపాలు, కరెంటు స్తంబాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. కమిషనర్ సురేశ్, వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, వార్డు కౌన్సిలర్ అబ్బవతి సరిత, స్థానిక టీఆర్ఎస్ నాయకులు మోటుపల్లి శ్రీనివాస్, అబ్బవతి నర్సింహ్మ, ఇతర వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.