శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, పులిహం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం (రేపు) బోనాలు నిర్వహించన్నునట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు నర్సింగ్గౌడ్, పాండు, హరిబాబు, రాజ్కుమార్యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్యాదవ్, మాజీ సర్పంచ్ సురేష్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్రెడ్డి, వేద పండితులు, గ్రామ పెద్దలు హనుమంత్రావు, రాజులుగౌడ్, నర్సారెడ్డి, పుల్చన్సింగ్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.