శామీర్పేట, ఆగస్టు: రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని శామీర్పేట సీఐ సుధీర్కుమార్ మంగళవారం కోరారు. శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదిక వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేయాలని ఆయన కోరారు.