కేపీహెచ్బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని పద్మజ వైద్యశాల డాక్టర్లు, సిబ్బందిని యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యులు అందించిన సేవలు ఎంతో గొప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల చైర్మన్ హన్మంతరావు, డాక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ఉద్దీన్, అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.