కేపీహెచ్బీ కాలనీ:దోమల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ సంతోష్కుమార్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఎంటమాలజీ సిబ్బంది పనితీరుపై ఆరాతీస్తూ హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో దోమల బెడదను తగ్గించేందుకు లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టిసారించినట్లు తెలిపారు.
దోమల వృద్ధికి ఆవాసాలైన మురికి కుంటలు, చెరువులలో గుర్రపుడెక్కను తొలగిస్తూ రసాయనాలను పిచికారి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయిల్బాల్స్, గంబూసియా చేపలను వదులుతూ దోమలను లార్వా దశలోనే నియంత్రిస్తున్నట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ విష జ్వరాలు ప్రభలకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్, ఏఎంహెచ్వోలు సంపత్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, ఎంటమాలజీ ఏఈ తిప్పర్తి నగేశ్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.