కీసర: మండలం అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ఆదర్శ సేవా అవార్డునందుకున్నారు. ఎంపీటీసీ కవితశశికాంత్ కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలు, ఎంపీటీసీ హక్కుల కోసం చేస్తున్న కృషికి గుర్తింపు దక్కింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఆదర్శ కళానిలయం ఫౌండర్ చేరాల ప్రకాష్ ఆధ్వర్యంలో నటుడు కోట శంకర్రావు, నేషనల్ సింగర్ సుబ్రహ్మణ్యం, షీటీమ్స్ లక్ష్మీ సామ్రాజ్యం చేతుల మీదుగా ఆదర్శ సేవా అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా పండుగ కవితశశికాంత్ మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ ప్రజలతో గడుపుతున్న తన సేవలను గుర్తించి ఆదర్శ సేవా అవార్డును అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.