మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూటికి నూరు శాతం మంది కరోనా వాక్సిన్ రెండు డోసులు తీసుకుని జీహెచ్ఎంసీ తరపున నూరుశాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న కాలనీగా సర్టిఫికెట్ను అందుకున్నారు. గురువారం జీహెచ్ఎంసీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి కాలనీ ట్రెజరర్ ఆనంద్కు నూరుశాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు సర్టిఫికెట్ అందుకున్నారు.