Patlolla Karthik Reddy | శంషాబాద్ మండలం బహదూర్గూడలోని 650 ఎకరాలను ప్రభుత్వ భూములుగా చూపించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్న విషయం తెలిసిందే. కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆ భూములను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే తమ భూముల కోసం శాంతియుతంగా ధర్నా చేపట్టిన శిబిరాల వద్దకు శనివారం తెల్లవారుజామున వేలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వారిని నిర్బంధించారు.
బహదూర్గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని కూడా నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళలు, గ్రామస్తులకు పోలీస్ స్టేషన్లో ఉన్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ధైర్యం చెప్పారు.
అయితే పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఇంకా విడుదల చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు నందిగామ పీఎస్ ముందు నిరసనకు దిగారు. పట్లోళ్ల కార్తీక్రెడ్డితోపాటు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఇంకా విడుదల చేయని నందిగామ పోలీసులు
దీంతో నందిగామ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైతులు, గ్రామస్తులను అరెస్ట్… https://t.co/VC94dajo2s pic.twitter.com/8jPu7FSI7K
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026