ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ సమీపంలో ఉన్న సురసముద్రం పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దు తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సురసముద్రం చెరువు నిండటంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అలుగు వద్ద గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని సురసముద్రం చెరువును రాష్ట్ర ప్రభుత్వం మీని ట్యాంక్బండ్గా గుర్తించందని ఆయన చెప్పారు. ఇప్పటికే సురముద్రం చెరువు మీనిట్యాంక్బండ్ సుందరీకరణ పనులు ప్రారంభం అయినట్లు గుర్తు చేశారు. గతేడాది నుంచి వర్షాల కారణంగా పనుల్లో కొంత అలసత్వం ఏర్పడిందన్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానల వల్ల నియోజకవర్గంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారడంతో మత్తడులు దుంకుతుడటం రైతన్నలకు శుభసూచకం అన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా మట్టి మిద్దేల్లో ప్రజలు నివాసాలు ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.