పాలకుర్తి, ఏప్రిల్15: వరి కోతల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో రూప సూచించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ క్లస్టర్లోని పలుగ్రామాల్లో రైతులు యాసంగి వరికోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. రైతు వేదిక భవనంలో జరిగిన సమావేశంలో రైతులు యాసంగిలో పొలం ఆరిన తరువాత కోయాలని సూచించారు. వరిగడ్డిని కాల్చివేయకూడదని తెలిపారు. వడ్లు పూర్తిగా ఆరిన తరువాత కొనుగోలు కేంద్రానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ దారవేని భూమయ్య, ఐకేపీ కేంద్రం ఇన్చార్జి బుర్రగడ్డ రేణుక, కట్కూరి రాజ్యలక్ష్మి, రైతులు గోండ్ర శ్రీనివాస్, పత్తిపాక కమలాకర్, బొడ్డు మొగిలి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలి
ఓదెల, ఏప్రిల్ 15: కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలని ఆర్బీఎస్ అధ్యక్షుడు బండారి ఐలయ్య కోరారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కొలనూర్ రైతు వేదిక భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు. తాలు, మట్టిపెల్లలు, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన ధాన్నాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. సమావేశంలో ఏఈవో స్వప్న, ఎంపీటీసీ కారెంగుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, ఉప సర్పంచ్ పాకాల సంపత్రెడ్డి, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బండ్ల గణేష్ ఆరోగ్యంపై డాక్టర్ల క్లారిటీ
విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి