అమరావతి : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో ఉద్రిక్త (Tension ) పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు (Budi Muthyalanaidu) స్వగ్రామంలో కూటమి నాయకులు శనివారం ప్రచారానికి వెళ్లగా వారిపై వైసీపీ (YCP) శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. బీజీపీ(BJP) నాయకుడిని ముత్యాల నాయుడు చెప్పుతో కొట్టడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది . ఒకరిపై ఒకరు దాడుల్లో నలుగురు కూటమి కార్యకర్తలకు తీవ్రగాయలయ్యాయి.
బాధితులకు మద్దతుగా గ్రామానికి వెళ్లిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సిఎం రమేశ్ కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీఎంరమేశ్ను గ్రామం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు.