అమీన్పూర్(జిన్నారం)/ కుత్బుల్లాపూర్, జూలై 28 : హైడ్రా కమిషనర్ రంగనాథ్ను విధుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కుత్బుల్లాపూర్ నియోజకర్గం లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మంగళవారం పేట్ బషీరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కా లనీల సంక్షేమ సంఘాల ప్రతినిధుల నేతృత్వంలో పటాకులు కాల్చి హైకోర్టు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయాన్ని కాపాడిన హైకోర్టుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ సర్కిల్ పరిధిలోని ఆయా గ్రామాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతూనే ఉన్నారు. రెండేండ్ల క్రితం కిష్టారెడ్డిపేటలోని మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేయించారు.
పటేల్గూడ పరిధిలో 2024 సెప్టెంబర్ 22న బీఎస్ఆర్కాలనీలో 22 ఇండిపెండెంట్ ఇండ్ల ను కూల్చివేయించారు. లోన్లు తీసుకొని ఇం డ్లు కొన్నామని, ఇండ్లు లేకపోవడంతో రోడ్డున పడుతామని, తమ చిన్నారుల భవిష్యత్తు ఆగమవుతుందని మొత్తుకున్నా అధికారులు స్పం దించలేదు. ఏప్రిల్ 12న ఐలాపూర్ పరిధిలోని ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేయించా రు. ఈ భవనంలో నివాసం ఉంటున్న 40 కు టుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుం డా.. ఖాళీ చేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం రేపింది. ఐలాపూర్ తాండాలోని 14 నిర్మాణాలను పోలీసులను మోహరించి కూల్చివేయించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా రంగనాథ్ను విధుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించటంతో బాధితులు హర్షం వ్యక్తంచేశారు.