హైదరాబాద్ : హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు.ఈ విషాదకర సంఘటన నగరంలోని కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బి.నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట డివిజన్లోని తిలక్నగర్ ప్రాంతానికి చెందిన వైకుంఠం కుమారుడు నల్ల ప్రవీణ్కుమార్(39) కొన్ని నెలల క్రితం పని కోసం కరీంనగర్ జిల్లా నుంచి వచ్చి తిలక్నగర్లో నివాసముంటున్నాడు.
ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, ప్రవీణ్కుమార్ ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగాలకు చెత్తబుట్ట తట్టుకుంది. ఆ చెత్తబుట్టను తీయడానికి ప్రయత్నిస్తుండగా ప్రవీణ్కుమార్కు ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు, క్లూస్టీం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి సంపులో పడి బాలుడు మృతి
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..