ప్రముఖ నటుడు నిర్మాత బండ్లగణేష్ మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. ఈయనకు రెండోసారి కరోనా వైరస్ రావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు. గత ఏడాది ప్రారంభంలో బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. టాలీవుడ్ లో కోవిడ్ అంటే భయపడుతున్న రోజుల్లోనే గణేష్ కు వైరస్ సోకింది. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి నయం చేసుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బయటకు వచ్చి మళ్ళీ తన పనులు చేసుకుంటున్నాడు ఈయన. అయితే ఇలాంటి సమయంలో ఈయనకు రెండోసారి వైరస్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత మరోసారి రావడం అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. అలాంటి సందర్భంలో బండ్ల గణేష్ కు రెండోసారి కూడా కరోనా వైరస్ సోకడంతో చాలా మంది షాక్ అయ్యారు. రెండు రోజులు ఈయనను ఐసీయూలో కూడా ఉంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మొన్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒళ్ళు నొప్పులు, జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకున్నాడు బండ్ల గణేష్. దాంతో ఆయనకు మరోసారి పాజిటివ్ అని తేలింది. దాంతో వెంటనే చికిత్స తీసుకున్నాడు బండ్ల గణేష్. అయితే రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో..బండ్ల గణేష్ సన్నిహితులతోపాటు శ్రేయోభిలాషులు కూడా కంగారు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడిందని..ఎలాంటి ప్రమాదం లేదని..మరికొన్ని రోజుల్లో మామూలు అయిపోతాడని వైద్యులు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వాళ్ళు చెప్పినట్లు సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే మళ్లీ భారీ సినిమాలతో నిర్మాతగా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు బండ్ల గణేష్.
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్