పెద్దపల్లి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీపీ చంద్రశేఖర్రెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలీసులు నిత్యం ప్రజల సేవకోసం పాటుపడుతూ ప్రాణాలు అర్పిస్తున్నారని తెలిపారు. పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నారు.