KTR | కౌలాలంపూర్: బీఆర్ఎస్ మలేషియా శాఖ , మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ( Telangana Formation Day) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ( Mahesh Bigala) కౌలాలంపూర్ నగరంలోని ఎంఈసీసీ ( MECC ) కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకలకు కేటీఆర్తోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
అంతకుముందు కేటీఆర్కు అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు, బీఆర్ఎస్ శ్రేణులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ రాకతో మలేషియాలోని తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
మలేషియాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇతర నాయకులు https://t.co/miHV5uul9T pic.twitter.com/eAsRRwSN6q
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2026
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర