సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిరాడంబరంగా కొనసాయి. ఈ ఏడాది కూడా కరోనా నియంత్రణ నిబంధనల కారణంగా సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో ఆదివారం నిరాడంబరంగా జరిగాయి. ఇక్కడి సుంగే కేడుట్లోని అరస కేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనల ప్రకారం బోనాలు సమర్పించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో సభ్యులు బోనాలు సమర్పించారు.
ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపులో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. ఈ బోనాల పండుగను సింగపూర్ కు ఐదేళ్ల క్రితం పరిచయం చేయడం ద్వారా TCSS పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీ కి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని ఆ సంస్థ కార్యవర్గ సభ్యులు అన్నారు. భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందజేస్తామన్నారు.
ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో సంస్థ ఉపాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి, వ్యవస్థాపక, పూర్వ అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరఫున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా సునీత రెడ్డి, రోజా రమణి, గోనె రజిత జూలూరు పద్మజ, కాసర్ల శ్రీనివాసరావు వ్యవరించారు.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్