సిద్దిపేట టౌన్, మే 7 : మూడు వారాలు ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్ వేసుకోవడమే అని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. ఎవరైనా రోడ్లపై మాస్క్ లేకుండా తిరిగిగే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. అన్ని రకాల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా..
కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన వారికి విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై 3407 కేసులు నమోదు రూ.34లక్షల 7వేల జరిమానా విధించామని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన వారిపై 259 ఈ పెట్టి కేసులను నమోదు చేశామన్నారు. కూరగాయల మార్కెట్లు, బస్టాండ్లు, షాపింగ్మాల్స్, ప్రధాన చౌరస్తాల్లో భౌతికదూరం పాటించని వారిపై 304 కేసులను నమోదు చేశామని తెలిపారు.