నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 29.722 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1070.40 మీటర్లు. ప్రాజెక్టులో ఇప్పుడు 326.26 మీటర్ల నీటిమట్టం ఉన్నది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 13.213 టీఎంసీల నీరు వచ్చి చేరింది.