ఖలీల్వాడి, ఏప్రిల్ 24 : లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సూచనల కోసం సాధారణ పరిశీలకురాలు ఎలిస్ వజ్ ఆర్ ఐఏఎస్ను సంప్రదించవచ్చని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఆమె ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల మధ్య నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఆమెకు నేరుగా లేదా సెల్ నంబర్ 8985340522 ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. వ్యయ పరిశీలకులుగా డీ ఎం నెమ్జీ ఐఆర్ఎస్ను కేటాయించారని, 898 5341588 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నేరుగా కలిసేందుకు అందుబాటులో ఉంటారని కలెక్టర్ చెప్పారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు ఎలిస్ వజ్ ఆర్ బుధవారం ఉదయం నగరానికి చేరుకోగా.. కలెక్టర్తోపాటు సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర జిల్లా అధికారులు స్వాగతం పలికారు.