ఖలీల్వాడి, ఏప్రిల్ 24 : నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆరో రోజైన బుధవారం 18 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి నాల్గో సెట్, బీజేపీ నుంచి అర్వింద్ మూడో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థి ఆరె రాజేందర్ మూడో సెట్ నామినేషన్ వేశారని, జీ సాయికృష్ణమూర్తి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని వివరించారు.
స్వతంత్ర అభ్యర్థులుగా కొండూర్ గంగాధర్, పోతు నవీన్, దేశబోయిన లక్ష్మీనారాయణ, చెంచుట అశోక్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా మొగిలి రాజ్కుమార్, పిరమిడ్ పార్టీ ఆ ఫ్ ఇండియా అభ్యర్థిగా పానుగంటి రజితా వాణి, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్ ఒక్కో సెట్ చొప్పున, స్వతంత్ర అభ్యర్థిగా ముత్యం, రఘు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు సమర్పించారని తెలిపారు. ఆలిండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండీ షాహెద్ఖాన్ రెండో సెట్ వేశారని వివరించారు. ఇప్పటివరకు 33 మంది అభ్యర్థులు మొత్తం 62 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి తెలిపారు.