వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్గా మూడ్ కవిత అంబర్ సింగ్, వైస్ చైర్మన్గా వెలగపూడి గోపాల్, సభ్యులతో మార్కెటింగ్ అధికారిణి గంగు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధులందరూ కలిసి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తే రాష్ట్రంలో పేదవాడనేవాడే కనపడడని అన్నారు.
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, వర్ని, మోస్రా జడ్పీటీసీ సభ్యులు బర్దావల్ హరిదాస్, గుత్ప విజయ భాస్కర్ రెడ్డి, వర్ని, రుద్రూరు ఎంపీపీలు మేక శ్రీలక్ష్మి వీరాజు, అక్కపల్లి సుజాత నాగేందర్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, నాయకులు మేక వీరాజు, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.