మోర్తాడ్: గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. బుధవారం విద్యార్థులతో స్కూల్ వద్దకు చేరుకొని ఉపాధ్యాయులకు కలిసి పరిస్థితిని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం మండల ప్రత్యేకాధికారి నర్సింగ్దాస్, గ్రామ ప్రత్యేకాధికారి ఉషారాణిలతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అజయ్, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, వార్డు సభ్యుడు మహేదర్ పాల్గొన్నారు.