కామారెడ్డి : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ 20 ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ సమావేశం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షతన జరుగనున్నది.
భిక్కనూర్, మాచారెడ్డి, దోమకోండ, బీబీపేట, కామారెడ్డి టౌన్, కామారెడ్డి రూరల్, రాజంపేట మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని కర్షక్ బీ.ఈడీ కళాశాలలో జరుగనున్న నియెజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాట్లను బుధవారం టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావులు పరిశీలించారు.