నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ బాగుందని సర్పంచ్ యశోద మహేందర్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చేవిధంగా విలేజ్ మార్కెట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను పరిశీలించారు.
ఆయాగ్రామాల్లో ప్రకృతి వనాలకు వాచర్ మ్యాన్లు ఉన్నారా లేదా అని ఎంపీడీవో సుబ్రమణ్యంను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, డీఎల్పీవో శ్రీనివాస్, విండో చైర్మన్ పెర్క శ్రీనివాస్, ఎంపీవో రాము, కార్యదర్శి ప్రవీన్, నాయకులు మహేందర్, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.